గౌనులో అలా ఫోజులిచ్చి పిచ్చెక్కిస్తున్న అనసూయ.. రంగమ్మత్త వైరల్ పిక్స్..

-

బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న అనసూయ భరద్వాజ్ వెండితెరపైన కూడా సత్తా చాటుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’గా అనసూయ ప్రేక్షకుల హృదయాలు దోచేసుకుంది.

ఇక ఆ తర్వాత ఈ సుందరికి వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘పుష్ప’లో దాక్షాయణిగా అనసూయ నెగెటివ్ రోల్ ప్లే చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ సంగతులు పక్కనబెడితే ఇన్ స్టా గ్రామ్ వేదికగా అనసూయ షేర్ చేసిన ఫొటో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

 

గౌనులో అలా చేతులు పైకి లేపి బొద్దుగా కనబడుతున్న అనసూయను చూసి నెటిజన్లు ‘వావ్ , గార్జియస్, వెరీ క్యూట్, లవ్ యూ మేడమ్ ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరి కొత్త డ్రెస్సులో కనిపించే అనసూయ ట్రెండ్ ఫాలో అవకుండా ట్రెండ్ సెట్ చేస్తుందని పోస్టులు పెడుతున్నారు.

సంతోషంగా ఉండటమనేది ఒక అలవాటుగా మార్చుకోవాలనే క్యాప్షన్‌ను ఈ ఫొటోకు ఇచ్చింది అనసూయ. మొత్తంగా అనసూయ తన గ్లామర్‌తో ఇటు బుల్లితెరను అటు వెండితెరను రెండిటినీ ఏలుతున్నదని చెప్పొచ్చు.

ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఈమె కీ రోల్ ప్లే చేసింది. ఈ ఫిల్మ్ వచ్చే నెల 29న విడుదల కానుంది. ఇందులో ‘సిద్ధ’గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు.

ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే అనసూయ భరద్వాజ్..గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ పిక్చర్‌తో పాటు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగ మార్తాండ’ చిత్రంంలోనూ నటిస్తోంది. ‘భీష్మ పర్వం’ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది యాక్ట్రెస్ అనసూయ.

 

Read more RELATED
Recommended to you

Latest news