గుడ్‌న్యూస్‌ చెప్పిన యాంకర్‌ లాస్య.. ఫుల్‌ ఖుషి అవుతున్న ఫ్యాన్స్‌!!

-

బుల్లితెర యాంక‌ర్‌గా లాస్యది ఓ ప్రత్యేకమైన జర్నీ. ‘సంథింగ్ స్పెషల్’ రూపంలో యాంకరింగ్ చేయడంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఆ తర్వాత క్రమంగా బుల్లితెరకు దూరమైన లాస్య తిరిగి కొంతకాలం నుంచి సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటోంది. యూట్యూబ్​ ఛానల్​తో ఫ్యాన్స్​ను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే.. లాస్య ఇటీవల ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో లాస్యకు ఏమైందో అంటూ ఆమె ఆరోగ్యం గురించి ఎన్నో కథనాలు బయటికి వచ్చాయి. తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఏమి కాలేదని, వైరల్ ఫీవర్ అని చెప్పింది.

ఇప్పుడు తాజాగా లాస్య తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెబుతూ మరోసారి వార్తల్లో నిలిచింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నానని ప్రకటిచింది. స్వయంగా యూట్యూబ్ వీడియోలో చెబుతూ.. ఎమోషనల్ అయ్యింది ఈ అమ్మడు. మొదటగా ఇంట్లోనే టెస్ట్ చేసుకున్న లాస్య.. ఆ తర్వాత డాక్టర్‌ని కలిసి కన్ఫర్మ్ చేసుకున్నట్లు వీడియోలో తెలిపింది. అలాగే భర్త మంజునాథ్‌తో కలిసి తన మెడికల్ రిపోర్ట్స్ చూపించింది. అయితే.. లాస్యకు మొదటి సంతానంగా కొడుకు జన్మించాడు. ఆ బాబుకు లాస్య ముద్దుగా జున్ను అని పిలుస్తుంటుంది. బిగ్‌బాస్‌లో చేసేప్పుడు కూడా జున్నుకు దూరంగా ఉండటం.. ఆమె ఎంత బాధపడిందో మనందరికి తెలిసిందే.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత లాస్య ఎక్కువగా సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టేసింది. ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ ద్వారా లాస్య మరింతగా జనాలకు దగ్గరవ్వాలని చూసింది. యూట్యూబ్‌లో ఫ్యామిలీ వీడియోలు, పండుగ వీడియోలు చేస్తుంటుంది. ఇక నెట్టింట్లో అయితే పర్సనల్ పిక్స్, ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంటుంది. అలా లాస్య తన ఫ్యాన్స్‌‌ను అలరిస్తుంటుంది.

అయితే ఐదేళ్ల తర్వాత లాస్య రెండోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే లాస్య ఆరోగ్యం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. లాస్య పెట్టిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news