నానీ చేతుల మీదుగా అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్…!

-

టాలీవుడ్ స్వీటి అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మాతగా వస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అనుష్క ప్రధాన పాత్ర కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తర్వాత స్వీటి క్రేజ్ అనేది భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి. అప్పటి నుంచి ఆమె సినిమాలపై అభిమానుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు అనే టాక్ ఉన్నా, నిర్మాతలకు మాత్రం కాసుల పంట పండించాయి.

ఇక ఈ సినిమా ట్రైలర్ ని మార్చ్ 6 మధ్యాహ్నం 12;12 నిమిషాలకు న్యాచురల్ స్టార్ నానీ చేతుల మీదుగా విడుదల చేయించబోతోంది చిత్ర యూనిట్.  ఈ మధ్య థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అనుష్కకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news