కోహ్లీపై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్

-

భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ జోడి. సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న కోహ్లీ, క్రికెట్ వరల్డ్ లో రారాజుగా ఎదిగితే.. ఆయన సతీమణి అనుష్క క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఉన్న ఓ ఎమోషనల్ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ తాజాగా వైరల్ గా మారింది.

తన భర్తను చాలా మిస్ అవుతున్నానని ఆప్షన్ పెట్టింది. ఈ ఫోటోలో అనుష్క శర్మ ,విరాట్ అనుష్క దగ్గరగా నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. అయితే అనుష్క శర్మ ప్రస్తుతం లండన్ లో తన తదుపరిచిత్రం ” చెక్డా ఎక్స్ప్రెస్” షూటింగ్ లో ఉన్నారు. ఇటు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా తో మొదటి టి20 మ్యాచ్ ముందు భారత క్రికెట్ జట్టుతో కలిసి శనివారం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎన్ బింద్ర స్టేడియానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ మొహాలీలో, అనుష్క లండన్ లో ఉండడంతో తన భర్తను మిస్ అవుతున్నట్లు పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version