బాలీవుడ్‌లో రీమేక్‌ కాబోతున్న బేబీ మూవీ.. హీరో ఎవరంటే..?

-

ఆనంద్ దేవ‌ర‌కొండ, వైష్ణవి చైత‌న్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం బేబీ. ‘క‌ల‌ర్ ఫొటో’ వంటి సినిమాకి క‌థ అందించిన సాయి రాజేష్ ఈ సినిమాకి ద‌ర్శక‌త్వం వహించారు. ముక్కోణపు ప్రేమకథా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అయింది ఈ మూవీ.

ఇప్పుడు ఈ సినిమా రీమేక్ గా హిందీలోకి వెళుతుంది. స్వయంగా సాయి రాజేష్ హిందీ వెర్షన్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ రీమేక్‌లో బాబీ డియోల్ కుమారుడు ఆర్యమాన్‌ను పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయినే అనుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌తో కలసి సాయి రాజేష్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే రిమేక్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుగులో సూపర్ హిట్ అయినా ఈ సినిమా బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధిస్తుందో లేదా అనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news