అరవింద సమేత సక్సెస్ మీట్.. బాలయ్య, ఎన్.టి.ఆర్ ఎమోషనల్ స్పీచ్

-

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అరవింద సమేత. సూపర్ హిట్ టాక్ తో వసూళ్ల సునామి సృష్టిస్తున్న ఈ సినిమా సక్సెస్ సందర్భంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సక్సెస్ మీట్ లో చిత్రయూనిట్ ను అభినందించడానికి స్పెషల్ చీఫ్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ అటెండ్ అయ్యారు.

ముందు చిత్రయూనిట్ అంతా మాట్లాడగా కళ్యాణ్ రాం మాట్లాడారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ మాట్లాడటం జరిగింది. చివరగా బాలకృష్ణ ప్రసంగించారు. ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం బాబాయ్ బిజీ షెడ్యూల్ లో ఉన్నా సరే బాబాయ్ వచ్చినందుకు థ్యాంక్స్ అని కళ్యాణ్ రాం అనగా తండ్రి హోదాలో నాన్నలాంటి బాబాయ్ ఈ వేడుకకు వచ్చినందుకు ధన్యవాదాలు అన్నాడు. అంతేకాదు ఇలాంటి గొప్ప సినిమా ఇచ్చినందుకు త్రివిక్రం కు థ్యాంక్స్ చెప్పాడు ఎన్.టి.ఆర్.

విషాద చాయలు అలముకున్న తన కుటుంబంలో ఇలాంటి సినిమా ఇచ్చి వెలుగులు తెచ్చినందుకు మరోసారి త్రివిక్రంకు ధన్యవాదాలు తెలియచేశాడు ఎన్.టి.ఆర్. ఇక ఈ వేడుకలో విశిష్ట అతిథిగా వచ్చిన బాలకృష్ణ మైక్ అందుకోవడమే ఆలస్యం అన్న నందమూరి హరికృష్ణ గురించి ప్రస్థావించారు. తెలుగుదేశం పార్టీ చైతన్య రధసారధి.. ముక్కుసూటి తనం.. అనుకున్నది చేసే ధైర్యం ఉన్న వ్యక్తి అన్న నందమూరి హరికృష్ణ మన మధ్య లేకపోవడం ఇంకా నమ్మశక్యంగా లేదని అన్నారు బాలయ్య. తండ్రికి తగ్గ తనయుడిగా హరికృష్ణ పైకి మొరటోడుగా కనిపించినా ఆయన మనసు వెన్నలా ఉంటుందని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోరే హరికృష్ణ దూరమవడం బాధాకరమని అన్నారు బాలయ్య. అరవింద సమేత సినిమా గురించి మాట్లాడుతూ దర్శకుడు త్రివిక్రం, నిర్మాత చినబాబు గురించి ప్రస్థావించారు. సినిమాకు పనిచేసిన నటీనటులందరికి తన కృతజ్ఞతలు తెలియచేశారు బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news