లైవ్ లో పాట పాడి అందరికీ షాక్ ఇచ్చిన బాలయ్య..!

-

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటనకు మారుపేరైన ఈయన.. యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్.. ఒళ్ళు గగుర్పొడిచే డైలాగ్ డెలివరీతో అందరి చేత థియేటర్లలో చప్పట్లు, ఈలలతో హుషారెత్తిస్తూ ఉంటారు.. ఇకపోతే అప్పుడప్పుడు తన గొంతుని సవరిస్తూ పాటలు కూడా పాడుతూ ఉంటారు. అలా కొద్ది రోజులపాటు ఇక తన సినిమాల్లో కూడా ఆయన పాటలు పాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా లైవ్ లో పాట పాడి అందరి చేత వాహ్ అనిపించారు బాలయ్య.

అంతేకాదు ఆయన పాటకి ఆడియన్స్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం ఇక్కడ విశేషం. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఖతార్లోని దోహాలో ఒక ఈవెంట్లో పాల్గొన్నారు బాలయ్య. అభిమానుల కోరిక మేరకు ఇందులో ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుడు చిత్రంలోని శివశంకరీ పాటను ఆయన అద్భుతంగా ఆలపించారు. ప్రొఫెషనల్ సింగర్ తరహాలో బాలయ్య పాట పాడడం అక్కడ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన పాడిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. చప్పట్లతో ప్రాంగణం మారుమ్రోగిపోయింది.

ఇకపోతే ఈ వీడియో కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుందని చెప్పాలి. గతంలో కూడా ఒక స్టేజిపై ఇదే శివశంకరి పాటను ఆయన ఆలపించారు. అంతే కాదు ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. ఇక బాలకృష్ణ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస విజయాలతో జోరు మీద ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్టు అందుకున్న ఆయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఎన్బికె 108 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీ లీల ఆయనకు కూతురు పాత్రలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news