ఓటీటీలోకి ‘భారతీయుడు 2’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

-

కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్సింగ్, ప్రియ భవానీ శంకర్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించారు. జులై 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలై మిశ్రమ ఫలితాలు సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానున్నట్లు సంస్థ ప్రకటించింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనన్నట్లు తెలిపింది.

28 ఏళ్ల కింద‌ట అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించిన చిత్రం ‘భార‌తీయుడు’ సినిమాకు భారతీయుడు-2 సీక్వెల్గా వచ్చింది. సినిమాని ప్ర‌క‌టించిన రోజు నుంచే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి, అంచ‌నాలు రేకెత్తించిన ఈ చిత్రంలో సేనాపతి దేనికోసం పోరాడతాడోనని ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. కానీ పార్ట్-2 భారతీయుడుకు వచ్చినంతగా రెస్పాన్స్ రాకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version