‘భారతీయుడు 2’ టీమ్ కీలక నిర్ణయం!

-

యూనిర్సల్ స్టార్ కమల్ ​హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ సినిమా  రీసెంట్​గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై మిక్స్​డ్​ రివ్యూ వినిపిస్తోంది. ఈ రివ్యూలు కలెక్షన్స్​పై భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నందున చిత్ర బృందం​ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇంతకీ అదేంటంటే..?

భారతీయుడు-2 సినిమా నిడివి ఇప్పటి వరకు మూడు గంటలు ఉంది. తాజాగా వచ్చిన రివ్యూతో నిడివి విషయంలో మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూడు గంటలయితే  ప్రేక్షకులకు లాగ్ ఫీలింగ్ కలుగుతుందేమోనని భావించి ఇప్పుడు దానిని ట్రిమ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 20 నిమిషాల ఫుటేజ్ ట్రిమ్ చేసినట్లుగా సమాచారం. అలా ట్రిమ్ చేసిన కట్​తోనే షోలు నడుస్తున్నట్లుగా తెలిసింది.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే తమిళనాడులో కన్నా ఇక్కడే టికెట్​ రేట్లు ఎక్కువగా ఉన్నాయట. ఇక ఇప్పుడు మిశ్రమ స్పందన నేపథ్యంలో టికెట్ రేట్లు తగ్గింపు విషయంపై కూడా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news