భోళా శంకర్: చిరంజీవి మళ్ళీ తన స్టామినా చూపించారా..?

-

ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ కలిసి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ఈరోజు విడుదలకు ముందే యూఎస్ వంటి ఓవర్సీస్ లో విడుదలైంది. మరి అక్కడి రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది ట్విట్టర్ రివ్యూల ద్వారా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మరి చిరంజీవి తన స్టామినా మళ్లీ నిరూపించారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

భోళాశంకర్ సినిమా తమిళంలో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సినిమాపై అనుకున్నంత స్థాయిలో బజ్ ఏర్పడలేదు. చాలామంది సినిమాను ఇప్పటికే చూశారు కాబట్టి పెద్దగా సినిమాపై అంచనాలు లేవనే చెప్పాలి మరొకవైపు ఈ సినిమాకు ఓటీటీ లేదని చెప్పిన చిరంజీవి.. రీమేక్ లు చేస్తే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు.వాస్తవానికి ఒకప్పుడు రీమేక్ లు చేయడంలో తప్పులేదు.. కానీ ఇప్పుడు ఓటీటీ లు వచ్చాక పైగా డబ్బింగుల్లో మన భాషల్లో విడుదలయ్యాక కూడా రీమేకులు చేస్తే అంతగా ఆసక్తి ఉండదు అనేది అభిమానుల మాట. కానీ భోళాశంకర్ సినిమాలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

70% కథ మార్చేసామని , ఒక కొత్త కథ చూసామన్న అనుభూతి కలుగుతుంది అని దర్శకుడు మెహర్ తెలిపారు. మరి యూఎస్ ప్రీమియర్స్ లో సినిమా చూసిన ఆడియన్స్ ఏం చెబుతున్నారు అంటే.. సినిమా యావరేజ్ గా ఉందని.. ఫస్టాఫ్ డీసెంట్ గా ఉండగా సెకండాఫ్ లో చిరంజీవి కామెడీ, కీర్తి సురేష్ తో వచ్చే ఎమోషన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. అంతే కాదు ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందట.. మరొకవైపు సెకండ్ హాఫ్ లో చిరంజీవి ఇచ్చే లోకల్ ఎంట్రీ కూడా బాగుంది అని, అయితే లోబోతో వచ్చే కామెడీ సీన్లు పెద్దగా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు

.

ఇక తమన్నా, చిరంజీవి మధ్య వచ్చే కామెడీ నవ్వులు పూయించేలా ఉందని, మొత్తానికైతే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని సెకండ్ హాఫ్ అస్సలు మిస్ కాకూడదని కూడా చెబుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమా యావరేజ్ గా పర్వాలేదు అనిపించుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news