భోళా శంకర్ ప్రొడ్యూసర్లపై కేసు..సినిమా రిలీజ్‌ ఆగిపోనుందా ?

-

భోళా శంకర్ ప్రొడ్యూసర్స్ కు ఊహించని షాక్‌ తగిలింది. సిటీ సివిల్ కోర్టు లో భోళా శంకర్ ప్రొడ్యూసర్ల పై కేసు నమోదు అయింది. తమను మోసం చేశారని కోర్టును ఆశ్రయించారు గాయత్రి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు. ఏజంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహరంలో ఏకే ఎంటర్మెంట్స్ కు 30 కోట్లు చెల్లించారు బత్తుల సతీష్.

bolashankar

సినిమా ఫ్లాప్ కారణంగా కేవలం వైజాగ్ వరకే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చింది ఏకే ఎంటర్టైన్మెంట్స్. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా భోళా శంకర్ నిర్మాతలు స్పందించలేదు.దీంతో తమను మోసం చేశారని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు గాయత్రి ఫిల్మ్స్ సతీష్. భోళా శంకర్ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ మోసం చేశారని ఆరోపణలు చేశారు. ఈ నెల 11న భోళా శంకర్ సినిమా విడుదల కానుంది. ఇక ఈ కేసు సీటి సివిల్ కోర్టు లో విచారణ పూర్తి అయింది. సినిమా విడుదల నిలిపేయాలని వేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇక ఇవాళ దీనిపై తీర్పు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news