బిగ్ బాస్: అభిజిత్ కి పనిష్మెంట్ ఇచ్చిన అమ్మ రాజశేఖర్..

-

ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. రింగులో రంగు కెప్టెన్సీ టాస్కులో అమ్మ రాజశేఖర్ కెప్టెన్సీ అయ్యాడు. దాంతో అప్పటి నుండి అభిజిత్, హారిక, అఖిల్, లాస్య ల పై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కెప్టెన్ అయినందుకు ఆరియానాని అసిస్టెంట్ గా పెట్టుకుని, రాజులా ఫీల్ అవుతున్నాడు. అవినాష్, మెహబూబ్, ఆరియానా, మోనాల్, అమ్మ రాజశేఖర్.. ఒక జట్టుగా కనిపిస్తుంటే సోహైల్ తప్ప మిగతా వారందరూ మరొక జట్టుగా విడిపోయినట్లు తెలుస్తుంది.

అందుకే పనులని అప్పగించే సమయంలో కూడా తన జట్టులో ఉన్నవాళ్ళకి తక్కువ పనులు చెప్పి మిగతా వారికి ఎక్కువ పనులు చెబుతున్నాడు. ఈ విషయం వారికి కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇలాంటివే ఉంటాయని, మిగతా వాళ్ళు కెప్టెన్ గా మారితే తనని ఏం చేస్తారో తెలుసని, దానికి కూడా సిద్ధం అయ్యాడు.

గుడ్డు కోసం పరిగెత్తి ఎవరికి కావాల్సింది వాళ్ళే తెచ్చుకోవడం, బిగ్ బాస్ నుండి తెలుగులో మాట్లాడండి అనే మాట వస్తే పనిష్మెంట్ ఉంటుందని చెప్పడం, అభిజిత్ ని కొద్ది నిమిషాల పాటు నిల్చో పెట్టడం చూస్తుంటే చాలా మంది ప్రేక్షకుల్లో ఒక రకమైన అభిప్రాయం కలుగుతోంది. అలా కాకుండా మరికొద్ది మంది మాత్రం ఈ గోలని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

ఐతే తన మాటే నెగ్గాలని, కెప్టెన్ అయ్యాను కాబట్టి నేనిలాగే ఉంటానని, నేను చెప్పిందే చేయాలని చెబుతున్న అమ్మ రాజశేఖర్ గారిపై నాగార్జున గారు ఏమంటారో చూడాలి. అసలే ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు. మరి రేపేం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news