బిగ్ బాస్: అతిధి గా వచ్చే మొదటి సెలెబ్రిటీ ఆమెనేనా..?

-

బిగ్ బాస్ మొదలై నాలుగు వారాలు అవుతుంది. ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ నుండి బయటకు వెళ్ళారు. ఐతే గత సీజన్లలో ప్రతీ ఆదివారం ఎవరో ఒక అతిధి వచ్చేవారు. నాగార్జునతో పాటు వచ్చే ఆ అతిధి హౌస్ మెంబర్స్ కి ఉత్సహం కలిగించేవారు. అలాగే ప్రేక్షకులకి కూడా ఉత్సాహం వచ్చేది. కానీ ఈ సీజన్లో ఇప్పటి వరకూ అతిధి రాలేదు. కరోనా కారణంగా నాలుగు వారాలు కావొస్తున్నా ఒక్క అతిధి కూడా హౌస్ మేట్స్ ని పలకరించడానికి రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ మేట్స్ ని పలకరించడానికి అతిధి వస్తుందంటూ వార్తలు వచ్చాయి.

ఆ అతిధి ఎవరో కాదు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి. నిశ్శబ్దం సినిమా అక్టోబర్ 2వ తేదీ నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్నందున ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలకరించడానికి వస్తుందంటూ పుకార్లు పుట్టించారు. మరి ఈ పుకార్లు నిజమా కాదా అన్నది తేలాలి. ఐతే అనుష్క శెట్టి, ఇప్పట్లో హైదరాబాద్ రావడానికే ఇష్టపడడం లేదట. కరోనా పూర్తిగా తగ్గితే గానీ ఇతర సినిమాల గురించి డిస్కషన్స్ పెట్టుకోవద్దని భావిస్తుందట. ఈ నేపథ్యంలో అనుష్క బిగ్ బాస్ షోకి వస్తుందన్న వార్తలు నిజం కావని తెలుస్తుంది. ఒక వేళ పుకార్లే నిజమయితే నాలుగవ సీజన్లో వచ్చిన మొదటి అతిధిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. చూడాలి మరేం జరగనుందో.

Read more RELATED
Recommended to you

Latest news