బిగ్‌బాస్ 7 గొడవ.. మరో ఇద్దరు అరెస్టు

-

బిగ్ బాస్ – 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన హరినాథ్ రెడ్డి(20) అనే విద్యార్థితో పాటు యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ కు చెందిన సుధాకర్(23) గోడవల్లో పాల్గొన్నట్లు గుర్తించారు.

వీరిని అరెస్టు చేసి, రిమాండ్ కు పంపారు. వీరితో పాటు పవన్(22) అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలవడంలో ‘రైతుబిడ్డ’ ట్యాగ్ ఎంతగానో ఉపయోగపడింది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ నుంచి ‘రైతుబిడ్డ’ ట్యాగ్ తీసేశారు. ‘మల్లా ఒచ్చినా’, ‘బిగ్ బాస్ సెవెన్ విన్నర్’, ‘స్పై టీమ్ విన్నర్’ అని బయోలో మార్పులు చేశారు. ఇన్ స్టాలో ఇతడికి 11 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అల్లర్ల కేసులో నాలుగు రోజులు జైల్లో ఉండి నిన్న విడుదలయ్యారు ప్రశాంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version