ఫ్రాన్స్ లో భారతీయుల విమానానికి లైన్ క్లియర్.. ఇండియాకు ఎప్పుడొస్తుంది?

-

ఫ్రాన్స్‌ అధికారులు 303 మంది భారతీయ ప్రయాణికులున్న విమానాన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో ఈ విమానాన్ని నిలిపివేశారు. అయితే తాజాగా ఈ విమానానికి ఆటంకాలు తొలిగాయి. మూడు రోజులు నిర్బంధం తర్వాత ఈ ప్లేన్ ఈరోజు మళ్లీ బయలుదేరనుంది. షెడ్యూల్ ప్రకారం నికరాగువాకు వెళుతుందా? లేక వెనక్కి మళ్లించి దుబాయికీ చేరుతుందా లేదా భారత్‌కు పయనం అవుతుందా? అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

అంతకముందు ఆదివారం రోజున ఈ ఘటనపై ఫ్రెంచ్‌ నిబంధనల ప్రకారం న్యాయవిచారణ ప్రారంభమైంది. విమానాన్ని అధీనంలోకి తీసుకున్న వాట్రీ విమానాశ్రయంలోనే నలుగురు న్యాయమూర్తుల ప్యానల్‌ బహిరంగ విచారణ చేపట్టింది. అనంతరం విమానం బయలు దేరేందుకు అనుమతులు రావడం వల్ల విచారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని జడ్జీలు హియరింగును రద్దు చేశారు. విమాన ప్రయాణికుల్లో కొందరు తమ బంధువులతో ఫోన్లలో హిందీ, తమిళంలో మాట్లాడారని ఫ్రెంచ్ మీడియా కథనం పేర్కొంది. ఓ కంపెనీ క్లయింట్ కోసం విమానాన్ని నడిపామని, మానవ అక్రమ రవాణా అరోపణలతో తమకు సంబంధం లేదని రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు న్యాయవాది తెలిపినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version