Bigboss7: అత్యధిక పారితోషకం తీసుకుంటున్న కంటెస్టెంట్స్ వీళ్లే..!

-

Bigboss7: ఎట్టకేలకు సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఖచ్చితంగా ఈ షో సక్సెస్ సాధిస్తుందని.. బిగ్ బాస్ అభిమానుల నుంచి కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ భిన్నంగా ఉండబోతోంది .ఇకపోతే తాజాగా సమాచారం ప్రకారం దాదాపుగా 20 వారాల పాటు ఈ షో ప్రసారం కానుంది అని , సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండగా అందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ షోలో ఎవరు అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే బిగ్ బాస్ షో నిర్వాహకులు శివాజీకి వారానికి ఏకంగా 4 లక్షల రూపాయల పారితోషకం ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఊహించని స్థాయిలో క్రేజ్ పాపులారిటీ ఉండడం వల్లే ఆయన అడిగినంత పారితోషకం ఇవ్వడానికి నిర్వాహకులు సిద్ధమయ్యారట. ఇక మరొక కంటెస్టెంట్ షకీలా కి వారానికి రూ.3.5 లక్షల రూపాయల చొప్పున పారితోషకం అందుతుందని సమాచారం.

హౌస్ లో పాల్గొన్న మిగతా కంటెస్టెంట్ లందరికీ కూడా వారానికి రూ.2.5 లక్షల రేంజ్ లో పారితోషకం ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ వారానికి రూ.1.5 లక్షలు తీసుకుంటున్నారట. ఇక అలాగే కామన్ మ్యాన్ క్యాటగిరీలో వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు మాత్రం వారానికి రూ.1 లక్ష లభిస్తోందని సమాచారం. ఇకపోతే హౌస్ లో అత్యధికంగా శివాజీ, షకీలా పారితోషకం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి కప్పు ఎవరు గెలుచుకుంటారు అన్న విషయం మరింత ఉత్కంఠ గా మారిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news