బోయపాటి, దానయ్య.. డిష్యుం.. డిష్యుం..!

-

బోయపాటి శ్రీను డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా వచ్చిన సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. పొంగల్ వార్ లో దిగిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సినిమా ఫలితంపై అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి ఓ లెటర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ లెటర్ వల్ల దర్శక నిర్మాతల మధ్య గొడవ మొదలైందట.

సినిమా క్లోజింగ్ కలక్షన్స్ లో 30 కోట్ల నష్టమని తేలింది. డిస్ట్రిబ్యూటర్స్ అంతా దానయ్య మీద పడగా రాం చరణ్ తన రెమ్యునరేషన్ లో నుండి 5 కోట్లు తిరిగి ఇచ్చాడట. బోయపాటి శ్రీనుని రెమ్యునరేషన్ లో కొంత తిరిగి ఇవ్వమని అన్నారట. వివి ఆర్ సినిమాకు 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న బోయపాటి శ్రీను రిటర్న్ గా 2 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పాడట. నష్టపరిహారంగా 5 కోట్లు ఇస్తేనే డిస్ట్రిబ్యూటర్స్ కు కనీసం సగం అయినా ఇవ్వగలరు. ఈ విషయంపై బోయపాటి శ్రీను, దానయ్యల మధ్య మాటల యుద్ధం జరిగిందట. దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ పంపకాల ఏర్పాట్లు జరుగిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news