క్లారిటీ ఇచ్చిన బోయపాటి శ్రీను ..!

-

వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్ గా ప్రారంభమై లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది. గతంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక ఈ సినిమా ఈ ఇయర్ నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బాలయ్య 106 ఇప్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయ్యిందని, ఫస్ట్‌ షెడ్యూల్‌లో భాగంగా కొన్ని ఎమోషనల్‌ సీన్స్ ని బాలయ్యపై చిత్రీకరించామని బోయపాటి తెలిపారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా సినిమా మీద వస్తున్న రూమర్స్‌ మీద స్పందించారు.

బాలయ్యతో తెరకెక్కిస్తున్న 106 పొలిటికల్‌ డ్రామా కాదని, సింహ లాగా సోషల్‌ మెసేజ్‌తో తెరకెక్కిస్తున్న కుటుంబకథా చిత్రమని తెలిపారు. ఈ సినిమాలో బాలయ్య కొత్త క్యారెక్టరైజేషన్‌లో అందరినీ ఆకట్టుకుంటారని అన్నారు. ఇక హీరోయిన్స్‌ విషయం లో వస్తున్న వార్తలు కూడా ఫేక్ అని కొట్టి పారేశారు. ఇంకా ఈ సినిమా కోసం హీరోయిన్స్ ని ఫిక్స్‌ చేయలేదని.. కథకు తగ్గట్టుగా ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారని లాక్ డౌన్ విరమించగానే హీరోయిన్స్ ఎవరన్నది ప్రకటిస్తామని తెలిపారు. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news