మామ పొలిటికల్ కార్యక్రమానికి బయలుదేరిన బన్నీ..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన మామ స్వగ్రామం అయిన నల్గొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి నేడు బయలుదేరుతున్నారు. తన మామ బి ఆర్ ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తన స్వగ్రామం వద్ద నిర్మించిన ఫంక్షన్ హాల్ ను ఈరోజు అల్లు అర్జున్ ప్రారంభించబోతున్నారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి భట్టుగూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఒక ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. ఇందులో ఆధునిక వసతులతో కూడిన.. వెయ్యి మందికి సరిపడే ఈ ఫంక్షన్ హాల్లో ప్రారంభోత్సవానికి తన అల్లుడు అల్లు అర్జున్ తో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి ని కూడా ఆయన ఆహ్వానించారు.

ఇక ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. సుమారు పదివేల మందికి భోజనాలతో పాటు ఈ వేడుకకు వచ్చిన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా 2014 ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఎన్నికలలో కూడా తన స్వస్థలమైన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన సిద్ధమవుతున్నారు.

అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రశేఖర్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు తన మామయ్య కోసం రాజకీయాల వేడుకలలో అల్లు అర్జున్ కూడా పాల్గొంటూ ఉండడం గమనార్హం. ఇక మరొకవైపు చంద్రశేఖర్ రెడ్డికి పార్టీ నుంచి సీటు వస్తే మాత్రం అల్లు అర్జున్ తప్పకుండా తన మామ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మామ కోసం పొలిటికల్ గా అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news