ఓటీటీలోకి ‘కెప్టెన్‌ మిల్లర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

ప్రముఖ తమిళ నటుడు ధనుష్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే అతడు తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంటాడు. అలా విడుదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశాడు. ఇక ఇటీవల మరో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ధనుష్‌ హీరోగా ప్రియాంక మోహన్ జంటగా నటించిన సినిమా కెప్టెన్ మిల్లర్. అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్‌లో రిలీజై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది.

నెల రోజులైనా కాకముందే ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్త అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news