సక్సెస్ కోసం ఆ సినిమాలో మార్పులు చేస్తున్న చిరంజీవి..!

-

చిరంజీవి బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి ఇప్పుడు ప్రతి సినిమాకి కూడా స్వయంగా అన్ని విషయాలలో పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది.

ఆ తర్వాత భోళా శంకర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. వేదాలం సినిమాకు రీమేక్ అన్నట్లుగా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇందులో తమన్నా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలకు పూర్తయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు మొన్నామధ్య ప్రకటించారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చేయబోతున్నారట.

ఇప్పటికే నటీనటుల డేట్స్ ని కూడా తీసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది. దాదాపు 25 రోజుల పాటు షూటింగ్ ఉంటుందని దాంతో చిత్రీకరణ పూర్తి అవుతుంది అని మెగా వర్గాల ద్వారా సమాచారం. అయితే ఈసారి సక్సెస్ కొట్టడానికి చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మినిమం గ్యారంటీ అన్నట్లుగా ఉండే విధంగా చిరంజీవి సినిమాలు ఉండాలని అందుకోసం ఎన్ని మార్పులు చేర్పులైనా చేస్తామన్నట్లుగా చిత్ర బృందం కూడా చెబుతున్నారు.మరి వేదాలం సినిమా ఎలా ఉండబోతోంది అని తెలియాలి అంటే వచ్చే సమ్మర్ వరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news