ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవడం నాకు తీరని లోటు: చిరంజీవి

-

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీలోకంలో విషాదం నింపింది. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రమోహన్‌ మరణం పట్ల ప్రముఖ నటుడు చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. తనకూ వ్యక్తిగతంగా తీరని లోటు అని తెలిపారు.

‘ ‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్లాం కావాలి’ లాంటి అనేక  ఆణిముత్యాల్లాంటి  చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా  తెలుగు  వారి మనస్సులో చెరగని ముద్ర  వేసిన సీనియర్ నటులు, కథానాయకులు చంద్రమోహన్ ఇక లేరని తెలియడం ఎంతో  విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ లో  ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప  అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవడం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకు  శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా  ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.’ అని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version