చిరంజీవి, పవన్ మల్టీ స్టారర్…?

-

ఎప్పుడో మూడేళ్ళ క్రితం సుబ్బిరామిరెడ్డి ఒక ప్రకటన చేసారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో తాను మల్టీ స్టారర్ సినిమా చేస్తా అని దానికి కథ కూడా రెడీ అయిందని దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది అని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏ ఒక్క ప్రకటన కూడా రాలేదు. రెండు మూడు సార్లు ఆయన దీనిపై ప్రకటనలు చేసినా సరే అది ముందుకి వెళ్ళే పరిస్థితి ఎక్కడా కనపడలేదు.

చిరంజీవి చేయడానికి ఆసక్తిగా ఉన్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటంతో ఈ సినిమా ముందుకి వెళ్ళే అవకాశం లేదనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వీరు చేసే సినిమా ఖరారు అయింది అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మహేష్ బాబుని తీసుకునే ప్రయత్నం చేయగా అందుకు మహేష్ ఆసక్తి చూపించలేదు అనే వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ ని అనుకున్నారు. రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా రష్మిక మంధనని కూడా ఖరారు చేసారు. కాని రామ్ చరణ్ కి రాజమౌళి అనుమతి ఇవ్వలేదని అందుకే మూడు నెలల పాటు ఈ సినిమాకు రాజమౌళి వచ్చే అవకాశం లేదని అన్నారు. ఇప్పుడు ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చిరంజీవి మాట్లాడినట్టు తెలుస్తుంది. కొరటాల కూడా దీనిపై ఆసక్తి చూపించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news