ఉమైర్ సంధు ట్వీట్ తో ప్రభాస్ – కృతి సనన్ పెళ్లి పై క్లారిటీ..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ నటన గురించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి పై అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల నుంచి ఆదిపురుష్ సినిమాలో నటించిన హీరోయిన్ కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పురుష్ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో కూడా ప్రభాస్ పై కృతి సనన్ చూపించిన కేరింగ్ కూడా అభిమానులకు కాస్త అనుమానాలను తెచ్చిపెట్టింది.

దీంతో ఆ వేదికపై వీరిద్దరి మధ్య జనాలు కూడా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో వీరి గురించి విపరీతంగా పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో తెరకెక్కించిన చిత్రం భేడియా సినిమాని తెలుగులో తోడేలు అనే పేరుతో విడుదల చేశారు. ఇందులో హీరోగా వరుణ్ ధావన్ నటించగా.. హీరోయిన్ గా కృతి సనన్ నటించింది. ఇందులో నటుడు వరుణ్ ధావన్.. ప్రభాస్ , కృతిసనన్ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఒక హింట్ ఇవ్వడం కూడా జరిగింది.

ఝలక్ దిఖ్లా జూ అనే షో లో ప్రత్యేక అతిధులుగా పాల్గొన్నారు కృతి సనన్, వరుణ్ ధావన్. ఇక కరణ్ జోహార్ సోలో కూడా వరుణ్ ధావన్ నీ జాబితాలో కృతి పేరు ఎందుకు మిస్ అయింది అని అడగగా.. ఆమె పేరు వేరే హృదయంలో ఉంది అని వారు హింట్ ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరో అని అడగగా.. ప్రస్తుతం దీపికా పదుకొనే షూటింగ్లో ఉన్నారని వెల్లడించారు. దీంతో కృతి సనన్ ప్రభాస్ రిలేషన్ షిప్ లో ఉన్నారని అధికారికంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజగా ఉమైర్ సందు ప్రభాస్, కృతి సనన్ త్వరలోనే నిశ్చితార్థం జరుగుతుందని తన ట్విట్టర్ నుంచి షేర్ చేయడం జరిగింది. కానీ ఉమైర్ సందు మాటలను నమ్మలేము ఆయన రోజు చేసే ట్రిక్ లో సగం అపద్దాలే ఉంటాయని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. అసలు విషయం ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news