అన్నీ ఉన్నా అమ్మతనానికి దూరమైన విజయశాంతి.. కారణం..?

-

వెండితెర రాములమ్మ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా , లేడీ అమితాబ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకోవడమే కాదు అంతకుమించి తన నటనతో అభిమానులను సొంతం చేసుకుంది కూడా.. ఇకపోతే ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా పోటీపడి సినిమాలను తెరకెక్కించి వారితో సమానంగా పారితోషకం తీసుకున్న ఏకైక హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో కోటి రూపాయల పారితోషకం తీసుకున్న హీరోయిన్ కూడా ఈమె.. అంతే కాదు ఎన్నో నంది అవార్డులతో పాటు మరెన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది.

అంతేకాదు ప్రజాసేవ కోసం ఈమె తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అయితే అన్నీ ఉన్నా సరే అమ్మతనానికి మాత్రం విజయశాంతి దూరమైందనే చెప్పాలి. 1988లో ఎంవీ శ్రీనివాస్ ప్రసాద్ అనే ఒక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ను బాలకృష్ణ సలహా మేరకు వివాహం చేసుకుంది విజయశాంతి. అయితే పెళ్లి సమయంలోనే తాను పిల్లలు కనకూడదని నిర్ణయాన్ని తీసుకొని మరి వివాహం చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతి మహిళా కూడా పెళ్లి అయిన తర్వాత అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మసులుకుంటుంది. జీవితంలో పిల్లల తర్వాతే ఏదైనా అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. కానీ విజయశాంతి మాత్రం కోట్ల రూపాయల ఆస్తి.. జీవితంలో ఏ లోటు లేకపోయినా అమ్మతనం అనే లోటును మాత్రం భర్తీ చేయలేకపోయింది.

అయితే విజయశాంతి ఇలా తల్లి కాకపోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఆమె ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేయాలి అని.. ఒకవేళ పిల్లలు పుడితే వారి బాధ్యత కారణంగా తాను ప్రజలకు ఏమి చేయలేక పోతానేమో అన్న భయంతో అమ్మతనానికి దూరమైందట. ఈ విషయం తెలిసి చాలామంది విజయశాంతి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం విజయశాంతి రాజకీయాలలో దూకుడుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news