నటుడు ధనుష్‌, ఐశ్వర్యకు కోర్టు ఉత్తర్వులు

-

నటుడు ధనుష్‌, ఐశ్వర్య ఇటీవలే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిని కోర్టులో హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నటుడు ధనుష్‌, రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్యలకు గత 2004లో ప్రేమ వివాహం అయిన విషయం తెలిసిందే. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గతేడాది ఈ ఇద్దరూ తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పటి నుంచి వారిద్దరు గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు.

వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్‌ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. కానీ వారు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో పరస్పర అంగీకారంతో విడాకులు కోరి చెన్నై ఫ్యామిలీ కోర్టులో గత వారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తి సుభాదేవీ ముందు సోమవారం విచారణకు వచ్చింది. అప్పుడు నటుడు ధనుష్‌, ఐశ్వర్యలు అక్టోబరు 7వ తేదీన కోర్టులో హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news