తిరుమల శ్రీ వారి సర్వదర్శనానికి 04 గంటల సమయం

-

 

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 04 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 04 గంటల సమయం పట్టింది. అలాగే..నిన్న ఒక్క రోజే.. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు 77, 511 మంది భక్తులు. నిన్న ఒక్క రోజే.. 26553 మంది భక్తులు తిరుమల శ్రీ వారికి తలనీలాలు సమర్పించారు.

4 hours time for Sarvadarshan of Tirumala Shrivaru

నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్లుగా నమోదు అయింది. తిరుమలలో రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం ఉండనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news