బాలయ్య,చిరంజీవి బరిలో ఉన్నారు కాబట్టే!దిల్ రాజు..!!

-

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు  ఇప్పట్లో కష్టాలు వదిలేలా కనిపించడం లేదు. విజయ్ హీరోగా  డైరెక్టర్ వంశీ పైడిపల్లి  తో తమిళ్ లో వారీసు ను తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

హీరో విజయ్ కి వున్న  రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా  జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. ఇక తెలుగు సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి వాల్తేరు వీరయ్య గా, జనవరి 13 న మరియు బాలయ్య బాబుల వీర సింహ రెడ్డి లు 12 న  సంక్రాంతికి వస్తున్నారు.

ఇవి రెండూ సినిమాలు మైత్రి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న వి కావటం తో తెలుగు లో ఇది రికార్డ్ గా వుంది. ఇంతవరకు ఒకే ప్రోడెక్షన్ హౌస్ సినిమాలు ఒకే సారి విడుదల అయిన చరిత్ర లేదు. అయినా కూడా దిల్ రాజు మైత్రి మూవీస్ తో ధియేటర్స్ కోసం గొడవలు పడుతున్నట్లు తెలుస్తోంది. చిన్న హీరోలు అయితే లొంగే వారు కాని ఇక్కడ ఉన్నది బాలయ్య, చిరు కావడంతో దిల్ రాజు పప్పులు ఉడకడం లేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version