ప్రభాస్ ఫస్ట్ లుక్ రాబోతోంది.. డైరెక్టర్ ట్వీట్ వైరల్

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఏ రేంజ్‌లో ప్రభావం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న ప్రభాస్ ఇండియన్ హీరోగా ఎదిగాడు. సాహో చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను నిరూపించుకున్నాడు. కేవలం ప్రభాస్ ఇమేజ్‌తోనే దాదాపు 350కోట్లు కొల్లగొట్టింది సాహో. ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం గురించి ఓ అప్‌డేట్ వచ్చింది.

ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ డియర్ లేదా రాధేశ్యామ్ అనే టైటిల్స్‌ను పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న చిత్రయూనిట్.. మొత్తానికి షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పడింది. ప్రతీ సారి షెడ్యూల్ వాయిదా పడుతుండటంతో ఆలస్యమవుతున్న వస్తున్న ఈ మూవీ గురించి డైరెక్టర్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

 

ప్రభాస్, పూజా హెగ్డేలు నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. తాజాగా చిత్ర దర్శకుడు ఓ ట్వీట్ చేశాడు.  మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే.. ఇంకా ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాల్సి ఉంది.. మీరు ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను త్వరలోనే చూడబోతోన్నా’ని ట్వీట్ చేశాడు. ఉగాదికి ప్రభాస్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోందని ఇన్‌సైడ్ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news