అన్ స్టాపబుల్ గురించీ షాకింగ్ న్యూస్ లీక్ చేసిన డైరెక్టర్..!

-

ఇటీవల కాలంలో ఆహా ఓటీటీ వేదికగా సూపర్ హిట్ అయినా షో అన్ స్టాపబుల్.. ఈ షో విషయంలో నందమూరి బాలకృష్ణ ఆహా యాజమాన్యం చాలా జాగ్రత్తలు వహించారు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండవ సీజన్ ని కూడా కాస్త గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే మొదటి సీజన్లో రాజకీయ అంశాలు లేకపోయినా.. రెండవ సీజన్లో మాత్రం రాజకీయ నాయకులు కూడా వచ్చి సందడి చేశారు.. ముఖ్యంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం సంచలనం అయ్యింది. అయితే ఈ షో గురించి దర్శకుడు బివిఎస్ రవి పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

గెస్ట్ లకు ఏ ఇబ్బంది లేకుండా ఉండే ప్రశ్నలు మాత్రమే బాలయ్య అడుగుతారని.. గెస్ట్ లకు ఇబ్బంది ఉండే ప్రశ్నలు తాను అడగను అని ముందే ఆహా యాజమాన్యానికి బాలయ్య చెప్పారని డైరెక్టర్ స్పష్టం చేశారు.. ఒకసారి చెప్పిన విషయం మళ్ళీ చెబితే బాలయ్యకు కోపం వస్తుందని.. అలాగే చంద్రబాబుని కలిసినప్పుడు షోలో ఏ ప్రశ్న అయినా అడగవచ్చు అని చెప్పారని.. లోకేష్ ఓటమి గురించి , ఫోటోల గురించి అడుగుతామని చెప్పినా ఆయన ఓకే అన్నారని తెలిపారు..

ముఖ్యంగా చంద్రబాబు ఎపిసోడ్ షూటింగ్ దాదాపు ఆరు గంటలకు పైగా జరిగింది అంటూ కొన్ని విషయాలను రివీల్ చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఇకపోతే ఈ షో మూడవ సీజన్ మే తర్వాత నుంచి రానుంది అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news