DJ టిల్లు -2 షూటింగ్ షురూ..హీరోయిన్ ఎవరంటే ?

-

సిద్దు జొన్నల గడ్డకు డిజె టిల్లు మంచి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తర్వాత .. రిలీజ్ అయిన డిజె టిల్లు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది మార్చి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా పార్ట్ 2 ను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర బృందం ఓ అప్డేట్ ను ఇచ్చింది.

డిజె టిల్లు 2 షూటింగ్ కు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్దు పై కొన్ని సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నైట్ టైం లో ఈ సినిమా షూటింగును ప్రారంభించారు. అయితే ఈ సినిమా పార్ట్ 1 లో రాధిక గా నటించిన నేహశెట్టి ప్లేస్ లో మరో హీరోయిన్ ను తీసుకురానున్నారు. మొన్నటి వరకు శ్రీలిలా ఫైనల్ చేసినట్లు వార్తలు రాగా అది ఫేక్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తికేయ ఫ్రేమ్ అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందట.

Read more RELATED
Recommended to you

Latest news