డైరెక్టర్ మెహర్ రమేష్ నటించిన సినిమా ఏంటో తెలుసా..?

-

తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే . ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో భారీగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో మెహర్ రమేష్ ను ఒక ఆట ఆడుకుంటున్నారనే చెప్పాలి. ఆయనపై నెగటివ్ కామెంట్స్ చేసి ట్రోల్స్ కూడా చేస్తున్నారు ముఖ్యంగా కన్నడ సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా అక్కడ భారీ విజయం సొంతం చేసుకోవడంతో వెంటనే మరొకసారి పునీత్ రాజకుమార్ తో కలిసి అజయ్ అనే సినిమాకి కూడా మెహర్ రమేష్ దర్శకత్వం వహించడం జరిగింది.

ఈ సినిమా మహేష్ బాబు ఒక్కడు సినిమాకి రీమేక్ గా తీశారు. ఇక ఈ సినిమా కూడా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మెహర్ రమేష్ సినిమాలు చేయడం జరిగింది. 2008లో ఎన్టీఆర్ తో కంత్రి సినిమా, ఆ తర్వాత ప్రభాస్ తో బిల్లా సినిమాలు తెరకెక్కించారు. ఇందులో బిల్లా సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోగా.. కంత్రి సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత 2011లో ఎన్టీఆర్ తో కలిసి శక్తి అనే సినిమా చేయగా అది కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఒక 2013లో వెంకటేష్ తో షాడో సినిమా తీయగా అది కూడా డిజాస్టర్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత భోళాశంకర్ సినిమా చేసిన అది కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇలా దాదాపు ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు అట్టర్ ప్లాప్ గానే నిలిచాయి. ఇదిలా ఉండగా మెహర్ రమేష్ కూడా ఒక సినిమాలో నటించారు.. ఆయన నటించిన సినిమా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మహేష్ బాబు హీరోగా నటించిన బాబి సినిమాలో మెహర్ రమేష్.. మహేష్ బాబు స్నేహితుడి క్యారెక్టర్ లో కనిపించారు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news