ఉమామహేశ్వరి ఏం వ్యాపారం చేసేవారు తెలుసా.. ముఖ్యంగా తండ్రి విషయంలో..!!

-

స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆగస్టు 1వ తేదీన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సంతానంలో అందరికంటే చిన్నవారైనా ఉమామహేశ్వరి అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమే. ముఖ్యంగా ఎన్టీఆర్ కి ఉమామహేశ్వరి అంటే పంచప్రాణాలట . ఇక ఆయన ఉన్నన్ని రోజులు ఆయనకు సంబంధించిన వృత్తిపరమైన మీటింగులు , అపాయింట్మెంట్స్ , అన్ని లావాదేవీలను ఉమామహేశ్వరి దగ్గరుండి చూసుకునేవారని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏదైనా పని ఉండి ఉదయం రెండు గంటలకే నిద్రలేస్తే ఆయనతో పాటు ఉమా కూడా నిద్రలేచి.. ఆ రోజు ఎవరిని కలవాలో.. ఏ పనులు చేయాలో అలా అన్ని షెడ్యూల్ చేసి మరీ చెప్పేదట. మరీ ముఖ్యంగా ఆమెపై ఉన్న ప్రేమతోనే చివరి శ్వాస వరకు ఆమె కోసం నిర్మించిన ఇంటిలోనే చివరి శ్వాస వదలారు ఎన్టీఆర్.

ఇక మొదటి భర్త వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఉమామహేశ్వరి ఆ తర్వాత రెండో వివాహం చేసుకుంది. ఇక జీవితం ప్రశాంతంగా సాగింది . అంతేకాదు రెండో వివాహం తర్వాత ఆమె వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టింది. బేకరీ కి సంబంధించిన వ్యాపారం చేస్తున్న ఆమె చిన్న కూతురు వివాహం కూడా ఇటీవలే జరిపించింది. ఇక ఆమె కూడా ఇటీవల అత్తగారింటికి వెళ్లిపోవడంతో ఒంటరి అయిపోయింది ఉమామహేశ్వరి .ఇక భర్త కూడా వ్యాపారం రిత్యా పలు ప్రదేశాలు తిరుగుతూ ఉండేవారు ఇక ఇంట్లో ఎవరూ లేరు మరింత మానసిక ఒత్తిడికి గురి అయింది.

ఇక దీంతో ఒంటరిగా తనను తాను ఇబ్బంది పెట్టుకోలేక చివరికి చున్నీతో ఫ్యాన్ కి ఉరివేసుకొని మరణించింది ఉమామహేశ్వరి. ఇకపోతే ఉమామహేశ్వరి మరణం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత చిన్న వయసులోనే మరణించడంతో ప్రతి ఒక్కరూ తమ బాధను వ్యక్తం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్, ప్రణతి లు కూడా ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news