BREAKING : టాలీవుడ్ హీరో నవదీప్ కు ఈడీ నోటీసులు

-

 

BREAKING : టాలీవుడ్ హీరో నవదీప్ కు ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా టాలీవుడ్ హీరో నవదీప్ కు ఈడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది ఈడీ. టాలీవుడ్ హీరో నవదీప్ కి డ్రగ్స్ తో లింక్ ఉందనే అనుమానంతో గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరుణంలోనే.. సెప్టెంబర్‌ 23 వ తేదీన నటుడు నవదీప్ ను నార్కోటిక్ అధికారులు డ్రగ్స్ కేసులో విచారించారు. దాదాపు 6 గంటలకు పైగా పలు ప్రశ్నలను సంధించారు.

Narcotic Bureau searches at hero Navdeep's house
Narcotic Bureau searches at hero Navdeep’s house

విచారణ పూర్తి అయిన తరువాత బయటికి వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడారు. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు నవదీప్. ముఖ్యంగా తనకు డ్రగ్స్ తో సంబంధం లేదని బయటపెట్టాడు. డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చినందుకుతాను విచారణకు వచ్చాను. రామచందర్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ.. పదేళ్ల కిందట పరిచయం. తాను ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో ఓ పబ్ ని నిర్వహించినందుకు పిలిచి విచారించారన్నారు. కానీ ఇప్పుడు హీరో నవదీప్ కు ఈడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది ఈడీ.

Read more RELATED
Recommended to you

Latest news