జానీ మాస్టర్ జ్యుడీషియల్ రిమాండ్ పొడగింపు..!

-

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడని ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో గోవాలో దాక్కున్న జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలులో ఉండగానే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు నాలుగు రోజుల కస్టడీకి పోలీసులకు అనుమతినిచ్చింది. దీంతో ఇవాళ కస్టడీ ముగిసింది.

దాదాపు నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ ను నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. కస్టడీ గడువు ఇవాళ ముగియడంతో నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. కోర్టులో విచారణ అనంతరం అక్టోబర్ 03 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత, పిల్లలు ఇవాళ ఉదయం ఫిలిం ఛాంబర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసిందని వెల్లడించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version