బాలీవుడ్ లోకి హీరోయిన్‌గా జెనీలియా రీఎంట్రీ

-

జెనీలియా ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ 2012 లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ తో వివాహం జ‌రిగిన త‌ర్వాత హీరోయిన్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంది. 2012 లో చివ‌రి సారిగా టాలీవుడ్ లో హీరో రానాతో నా ఇష్టం అనే సినిమాలో హీరోయిన్ గా క‌నిపించింది. పెళ్లి త‌ర్వాత బాలీవుడ్ లో ప‌లు సినిమాల‌లో చిన్న‌ పాత్ర‌ల‌లో క‌నిపించింది. అలాగే టాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌లేదు.

కాగ దాదాపు 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత జెనీలియా మ‌రోసారి హీరోయిన్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. బాలీవుడ్ లో విడుద‌ల కాబోయే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేశారు. షాద్ అలీ డైరెక్షన్ లో జెనీలియా హీరోయిన్ గా న‌టిస్తుంది. కాగ ఈ సినిమాలో హీరో పాత్ర‌లో జెనీలియా భ‌ర్త రితేష్ దేశ్ ముఖ్ నటిస్తున్నాడు. కాగ ఈ సినిమాకు మిస్ట‌ర్ మ‌మ్మీ అనే టైటిల్ ను కూడి ఫిక్స్ చేశారు. ఈ సినిమా పోస్ట‌ర్ లో హీరోయిన్ జెనీలియాతో పాటు రితేష్ దేశ్ ముఖ్ కూడా ప్రెగ్నెంట్ గా క‌నిపిస్తున్నాడు. కాగ సినిమా కామెడీ జోన‌ర్ లో విడుద‌ల కాబోతుంద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Latest news