Guntur Kaaram OTT : ‘గుంటూరు కారం’ సినిమా ఓటీటీ రిలీజ్ అప్పుడే..?

-

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్  దర్శకత్వంలో తెరకెక్కిన  తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా తన ఘాటుని కొనసాగిస్తూనే ఉంది.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన మాస్ స్వాగ్ చూపిస్తూనే, మదర్ సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద మంచి  వసూళ్లని  రాబట్టింది.

Guntur Kaaram OTT in feb.jpg

అయితే, సంక్రాంతికి రిలీజ్ అయి థియేటర్లలో సందడి చేస్తున్న ‘గుంటూరు కారం’ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 9 లేదా 16వ తేదీల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news