షూటింగ్ లో గాయపడ్డ గోపిచంద్.. ఆందోళనలో అభిమానులు..

-

శ్రీవాస్‌ దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ షూటింగ్‌లో గోపీచంద్‌కు ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం తెలిపింది. ‘మైసూర్‌లో జరుగుతున్న షూటింగ్‌లో కాలు కొద్దిగా స్లిప్‌ అవడంతో గోపీచంద్‌ పడిపోయారు. అయితే ఆయనకు ఏమీ కాలేదు. సురక్షితంగానే ఉన్నారు. అభిమానులు, స్నేహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని దర్శకుడు శ్రీవాస్‌ ఓ ప్రకటనలో ప్రకటించారు. గోపీచంద్‌ నటిస్తున్న 30 వ చిత్రం ఇది. టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఒక ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొనడంతో గోపీచంద్‌కు గాయాలైనట్టు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్‌లో కాలు జారీ కింద పడినట్లు మేకర్స్ తెలిపారు. అయితే ప్రస్తుతం గోపీచంద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఎవ్వరు ఆందోళన పడవద్దని డైరెక్టర్ శ్రీవాస్ తెలిపాడు. మొత్తానికి గోపీచంద్‌కు గాయాలు అనే వార్తలు మాత్రం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version