BREAKING : హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టుకు హీరో రానా

-

ఫిలిం నగర్ లోని స్థలం వివాదం పై సిటీ సివిల్ కోర్ట్ కి హీరో దగ్గు పాటి రాణా హాజరు అయ్యారు. ఫిలిం నగర్లో 2200 గజాల ఈ స్థలం గతంలో అలనాటి నటి మాధవి లత కి సంబంధించింది. ఇట్టి స్థలం దగ్గుపాటి కుటుంబం అక్రమంగా కొనుగోలు చేసిందని..ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలం హీరో వెంకటేష్, అన్న సురేష్ పేరు మీద ఉంది.

కొన్ని రోజుల తరువాత 2014 లో నగరంలో ఉన్న ఓ వ్యాపారికి లీజ్ అగ్రిమెంట్ ఇచ్చారు. లీజ్ అగ్రిమెంట్ 2016 లో, 2018లో కూడా రినేవాల్ చేసినప్పటికీ ఇంకా లీజ్ అగ్రిమెంట్ ఇంకా కొనసాగుతుండగానే కేసు అయింది. దగ్గుపాటి సురేష్ తనయుడు సినీ హీరో దగ్గుపాటి రాణా పేరు మీద 1000 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే లీజ్ పిరేడ్ ఉండగా వ్యాపారిని స్థలం నుండి ఖాళీ చేయాలని ఒత్తిడి చేసి ఆర్ధికంగా నష్టపరిచారని సమాచారం. అందుకు సిటీ సివిల్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు ఆ వ్యాపారి. కోర్టు ధిక్కరణ చేసి దగ్గుపాటి సురేష్ తన పరపతిని ఉపయోగించి రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు చేశారు ఆ వ్యాపారి. దీంతో దగ్గుపాటి రాణాకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు సిటీ సివిల్ కోర్టుకి దగ్గుపాటి రాణా హాజరు అయ్యారు.దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version