‘టుస్సాడ్స్’లో కాజల్ మైనపు బొమ్మ రెడీ.. రేపే ఆవిష్కరణ..!!

-

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తమ మైనపు విగ్రహాన్ని నెలకొల్పటం అన్నది ఓ అరుదైన గౌరవంగా భావిస్తారు సినీ తారలు. ప్రపంచ ప్రఖ్యాత తారలకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. అయితే ఇటీవల ఈ అరుదైన గౌర‌వం కాజ‌ల్ అగ‌ర్వాల్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం అందాల కథానాయిక కాజల్ అగర్వాల్ అమితానందం వ్యక్తం చేస్తోంది. సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహం ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని కాజల్ తెగ సంబరపడిపోతూ వీడియో పోస్ట్ చేసింది. రేపు టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె విగ్రహావిష్కరణ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో కాజల్ అక్కడికి వెళ్లింది. ఇక ఇప్ప‌టికే టాలీవుడ్ హీరోలు ప్రభాస్‌, మహేష్ బాబు విగ్రహాలను కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ అందాల భామ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. కాగా, అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూరో కాజల్ అగర్వాల్. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కొద్దీ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ దక్కించుకుంది. ఇక కాజల్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపుదిద్దుకుంటోన్న ఓ సినిమాతో పాటు, కమలహాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లోనూ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news