బ్రేకింగ్‌: ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కార్యాలయాలపై ఐటీ దాడులు..

-

ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకు సంబంధించిన రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ ఈ రోజు ఉదయం నుంచి దాడులు మొదలుపెట్టింది. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో పలు ధియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం సురేష్ బాబు.. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ‘వెంకీ మామ’ సినిమా తెరకెక్కిస్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కంగారుపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news