గాయపడ్డ హీరో వరుణ్ సందేశ్.. షాక్ లో ఫ్యాన్స్..!!

-

తాజాగా వరుణ్ సందేశ్ నటిస్తున్న ది కానిస్టేబుల్ సినిమా షూటింగ్లో భాగంగా వరుణ్ సందేశ్ కాలుకు బలమైన గాయం అయినట్టు చిత్ర బృందం వెల్లడించింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని వైద్యులు వరుణ్ సందేశ్ ను పరీక్షించి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇక దీంతో మూడు వారాలపాటు ది కానిస్టేబుల్ సినిమా షూటింగ్ నిలిచిపోయిందని కూడా స్పష్టం చేసింది. ఇక మైఖేల్ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ నటిస్తున్న సినిమా కావడంతో అందరూ ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పోలీస్ నేపథ్యంలో వచ్చే ఈ కథలో వరుణ్ కానిస్టేబుల్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాతనే ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాత బలగం జగదీష్ మీడియాతో వెల్లడించారు. ఇకపోతే వరుణ్ సందేశ్ ఇలా ఉన్నట్టుండి గాయాల పాలవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలాగే సినిమా షూటింగ్లలో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు. ఏదేమైనా సినిమా షూటింగ్ సెట్లలో హీరో హీరోయిన్లు ఇలా గాయాల పాలవ్వడం సహజమే అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇక వరుణ్ సందేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం తన భార్యతో కలిసి పలుషోలకు హాజరవుతున్న ఈయన ఇప్పుడు సినిమాలలో భాగంగా ఇలా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని ఆయన భార్య కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనా వరుణ్ సందేశ్ త్వరగా కోలుకోవాలని అటు కుటుంబ సభ్యులు ఇటు సెలబ్రిటీలు కూడా ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news