ఏనుగు దంతాల స్మగ్లింగ్ అంటూ వ‌స్తున్న అలియా భట్.. ఆస‌క్తిక‌రంగా ‘పోచర్‌’ ట్రైల‌ర్

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నిర్మాతగా మారి తెర‌కెక్కిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘పోచర్‌’ . ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో కలిసి అలియా భట్ నిర్మిస్తుంది. నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య త‌దిత‌రులు ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు ఎమ్మీ అవార్డు విన్నర్‌ రిచీ మెహతా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ సిరీస్ నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్ గమ‌నిస్తే.. ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో పాటు, అడవుల్లో వన్య ప్రాణులపై దాడుల చేసే వారిపై ఈ సిరీస్ రానుండ‌గా.. వారిని ప‌ట్టుకునేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, NGO కార్మికులు, లోక‌ల్ పోలీసులు ఎం చేశారు అనేది ఈ సిరీస్ కథ అని తెలుస్తుంది. 8 ఎపిసోడ్‌లుగా రానున్న ఈ సిరీస్ . ఫిబ్రవరి 23వ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్‌టైన్‍మెంట్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version