నితిన్ కోసం రానున్న పవన్ కళ్యాణ్….??

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది అజ్ఞాతవాసి రిలీజ్ తరువాత సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ జనసేన పార్టీ తరపున ఆంద్రప్రదేశ్ నుండి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలవడం జరిగింది. ఇక ఇటీవల ఫ్యాన్స్ కోరిక మేరకు మరికొద్దిరోజుల్లో తన తదుపరి సినిమాలో నటించబోతున్న పవన్, ఇటీవల కొన్నాళ్లుగా తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి సందడి చేసారు పవన్.

ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నితిన్ హీరోగా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ సినిమా ప్రీ రిలీజ్ కు ప్రత్యేక అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు సమాచారం. గతంలో నితిన్ నటించిన పలు సినిమాల ప్రారంభోత్సవ మరియు ఆడియో ఫంక్షన్ కార్యక్రమాలకు పవన్ హాజరైన విషయం తెలిసిందే. అలానే ఈ సినిమా ఫంక్షన్ కు కూడా తన అభిమాన హీరోని ఆహ్వానించాలని నితిన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

 

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొంత బిజీ షెడ్యూల్స్ తో గడుపుతున్నారని, కావున ఆయన భీష్మ సినిమా ఫంక్షన్ కు ఎంతవరకు వస్తారు అనేది కొంత అనుమానమే అని కూడా అంటున్నారు. నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది……!!

Read more RELATED
Recommended to you

Exit mobile version