సాయి పల్లవి సినిమాలకు బ్రేక్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదేనా..?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పరిమితంగా సినిమాలు చేస్తూ అభిమానులను బాధపెడుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల వరుస ప్లాప్ లు రావడంతో తెలుగులో కాస్త హవా తగ్గిందని చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగులో సాయి పల్లవి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. తమిళంలో ఒక సినిమాకు ఒప్పుకున్న సాయి పల్లవి తెలుగు సినిమాల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుండడంతో హాట్ టాపిక్ గా మారింది. సరైన కథలను ఎంచుకోలేకపోవడం వల్లే సాయి పల్లవి సినిమాల విషయంలో ఆ విధంగా చేస్తోంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మునుముందు సాయి పల్లవి తెలుగు సినిమాలలో నటిస్తారో లేదో అనేది కూడా తెలియాల్సి ఉంది. కేవలం అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని భావిస్తుందట. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ కు జోడిగా ఆమె ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా రీమిక్స్ సినిమాలలో నటించడం కూడా సాయి పల్లవికి పెద్దగా నచ్చదు.. కానీ సాయి పల్లవి గ్యాప్ ఇస్తే తెలుగు ప్రేక్షకులు సైతం ఆమెను మరిచిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని.. మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

మరి పుష్ప 2 సినిమాలో సాయి పల్లవి నటిస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ.. అందులో ఏమాత్రం నిజం లేకపోయింది. ప్రస్తుతం సాయి పల్లవి రెండు కోట్ల రూపాయలకు అటు ఇటుగా పారితోషకం తీసుకుంటుంది. ఒకవేళ 2023 కలిసొస్తే మంచి ఇమేజ్ లభిస్తుంది.. లేకపోతే తెలుగు ప్రేక్షకులు మరిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. కథల ఎంపిక విషయంలో సరిగ్గా ఆలోచించకపోవడం వల్లే తెలుగు సినిమాలకు దూరం అవుతోంది అనే వాదన కూడా వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version