ఇస్మార్ట్ బ్యూటీస్ కి పూరి జగన్నాధ్ ఏమీ చేయలేదా ..?

-

టాలీవుడ్ లో డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలో పడిన హీరోల స్టార్ ఒక్కసారిగా తిరిగిపోతుంది. అంతేకాదు మాస్ ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇక హీరోయిన్స్ విషయం తీసుకుంటే పూరి చేతిలో పడిన ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరోయిన్ రేంజ్ కి రావాల్సిందే. అంతగా పూరి తన సినిమాలో నటించిన హీరోయిన్స్ కి లైఫ్ ఇస్తాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన ఇద్దరి హీరోయిన్స్ కి ఒక్కసారిగా పాపులారిటి వచ్చేసింది. వాళ్ళే నిధి అగర్వాల్, నభా నటేష్. ఈ ఇద్దరు అంతక ముందు సినిమాలు చేశారు. కాని అవి ఏమాత్రం సక్సస్ ఇవ్వలేదు.

 

నిధి అగర్వాల్ అక్కినేని బ్రదర్స్ ఇద్దరి తోను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. నాగ చైతన్య తో సవ్యసాచి, అఖిల్ తో మిస్టర్ మజ్ఞు సినిమాలు చేసింది. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. అలాగే నభా నటేష్ కూడా నన్ను దోచుకుందువటే సినిమాలో నటించింది. ఆ సినిమా నభా కి మంచి పేరు తెచ్చిపెట్టింది గాని అవకాశాలు మాత్రం రాలేదు. కానీ పూరి జగన్నాధ్ ఈ ఇద్దరిని ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసుకొని గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్ లకు పూరి మంచి కమర్షియల్ హిట్ ని ఇచ్చారు.

పూరి హీరోయిన్స్ ని స్క్రీన్ మీదా బాగా ప్రజెంట్ చేస్తారన్న విషయం అందరికి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఈ ఇద్దరి దగ్గరున్న టాలెంట్ ని బయటకి తీశాడు. అప్పటి వరకు లేని క్రేజ్ ని ఈ ఇద్దరి హీరోయిన్స్ కి పూరి ఇచ్చాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినప్పటికి తెలుగులో మాత్రం ఈ ఇద్దరికి ఎందుకనో అవకాశాలు రావడం లేదు. వాస్తవంగా అయితే పూరి సినిమా చేస్తున్నప్పుడే ఆ హీరోయిన్ కి మరో రెండు సినిమాలు చేతిలో పడతాయి. కానీ ఇస్మార్ట్ శంకర్ వచ్చి ఇన్ని నెలలవుతున్నా నిధి, నభా లకి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ రాకపోవడం ఆశ్చర్యకరం. కొందరి ఫేట్ అంతే. ఇలాంటి వాళ్ళ లక్ ని పూరి కూడా మార్చలేరు.

Read more RELATED
Recommended to you

Latest news