ఈ ముగ్గురికి హిట్ తప్పనిసరి ..!

-

2019 లో నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన మూడు సినిమాలు ఫ్లాపయిన సంగతి తెలిసిందే. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు తెరకెక్కించారు. ఈ బయోపిక్స్ నిర్మిస్తున్నన్ని రోజులు ఇండస్ట్రీలో ఒకటే చర్చలు జరిగాయి. ఈ సినిమాలు రెండు భారీ సక్సస్ లు అందుకుంటాయని తెగ చెప్పుకున్నారు. క్రిష్ తెరకెక్కించిన ఈ భాగాలలో చాలామంది నటీ నటులతో పాటు కొంతమంది టెక్నీషియన్స్ కూడా నటించారు.

 

కాని రెండు భాగాలు అందరి అంచనాలను, ఊహలను తారుమారు చేశాయి. ఈ సినిమాలు అందరినీ బాగా డిసప్పాయింట్ చేశాయి. తర్వాత వచ్చిన ‘రూలర్’ సినిమా కూడా బాలయ్యకు హిట్ ఇవ్వలేదు. అయినా సరే మరో సినిమాకి సిద్దమయ్యారు. తనకి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను కి డేట్స్ ఇచ్చి అందరికి షాకిచ్చారు. వాస్తవంగా బోయపాటి శ్రీను రాం చరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో బోయపాటి శ్రీను అనుకున్న హీరోలెవరూ తనతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. దాంతో చివరకి బాలకృష్ణ తో కమిటయి ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కోసం తాపత్రయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను లతో పాటు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కి చాలా కీలకం. బోయపాటి శ్రీను మిర్యాల రవీందర్ రెడ్డి కి మంచి బాండింగ్ ఉంది. ఈ ఇద్దరు గతంలో జయ జానకి నాయక సినిమా తీశారు. అంతకముందు గౌతం మీనన్ తెరకెక్కించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాని నిర్మించాడు మిర్యాల రవీందర్ రెడ్డి. అయితే ఈ రెండు సినిమాలు మిర్యాల రవీందర్ రెడ్డి కి అంతగా లాభాలు తెచ్చిపెట్ట లేదు. అయినా బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల మీద నమ్మకంతో సినిమా నిర్మించడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా సక్సస్ ఈ ముగ్గురికి చాలా కీలకం. ఈ సినిమా సక్సస్ లో ఏఅమాత్రం రిజల్ట్ తేడా వస్తే ఎక్కువగా ఇబ్బందులు పడేది నిర్మాతే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news