ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం డ్రాగన్. ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ త్రిప్తి దిమ్రీను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్ స్పాట్ లో ప్రత్యేక సెట్ ను ఏర్పాటు చేసినట్లుగా సినీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

ఇందులో ఎన్టీఆర్ తో ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రను పోషించనున్నారు. ఈ సీక్వెన్స్ లో ప్రకాష్ రాజ్ తో సహా మరికొంతమంది నటీమణులు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. దీనిపైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మరోవైపు ఈ చిన్నది ప్రభాస్ సరసన స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకోవడంతో తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.