“ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” లిరికల్ సాంగ్ రిలీజ్ !

-

నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు నటుడిగా నరేష్ కు చాలా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ మూవీ నుండి ఒక లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. హీరో నితిన్ చేతుల మీదుగా ఈ సాంగ్ ని రిలీజ్ చేయించారు. ” నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా.. నా చేతి గీతలో కొత్త రేఖవై నావా” అంటూ ఈ పాట సాగుతోంది.

శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జావేద్ అలీ ఆలపించాడు. ఈ పాటలో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయి. నవంబర్ 11వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news