రంభ అభిమానిగా మారిన జగపతి బాబు.. నేను కూడా అంటున్న శర్వానంద్

-

ఒకప్పుడు వెండి తెరను తన అందచందాలతో షేక్ చేసింది రంభ. ఈమె అందానికి కుర్రకారు థియేటర్లకు క్యూ కట్టేవారు. స్టార్‌ హీరోలతో అనేక సినిమాలు చేసిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు టాటా చెప్పింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రంభకు నేనూ ఓ అభిమానినే అంటున్నాడు మన జగపతి బాబు.నిజమేనా అనే సందేహం రావచ్చు. రియల్‌ లైఫ్‌లో కాదండి. రీల్ లైఫ్‌లో. సినిమాల్లో జగపతిబాబు, రంభ జోడీగా నటించిన విషయం విదితమే. ఇక రీల్‌ లైఫ్ జోడీ మరోసారి ప్రేక్షకులను మైమరిపించేందుకు రెడీ అయింది.

అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహా సముద్రం’. ఇందులో శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ రీసెంట్‌గా వైజాగ్‌లో జరిపారు. స్పెషల్ గా వేసిన సెట్‌లో జగపతిబాబుపై ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ సాంగ్‌లో రంభ ఫొటోలు, ఫ్లెక్సీలతో జగపతిబాబు, రంభ అభిమానిగా నటిస్తారు. శర్వానంద్‌ కూడా ఇందులో ఉన్నాడంట.

అంతే కాదు ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ రంభ పర్మిషన్‌ కూడా తీసుకున్నారని సమాచారం. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ మూవీని కొవిడ్ నేపథ్యంలో వాయిదా వేస్తారా లేక విడుదల చేస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. మొత్తానికి లేటు వయసులో అయినా పాత జోడీ మెప్పించేందుకు రెడీ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news